Murder: సామర్లకోటలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని పుట్టిన రోజు నాడే.. అతని స్నేహితుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ
స్నేహితుడిని నరికి చంపిన యువకుడు
సామర్లకోట, న్యూస్టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని పుట్టిన రోజు నాడే.. అతని స్నేహితుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్నగర్లో నివాసముంటున్న తలాటి శివ(28) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో అతనికి నరాల మణికంఠతో స్నేహం ఏర్పడింది. వీరి మధ్య వివాదం రావడంతో అక్కడి నుంచి వచ్చి సోదరుడితో కలిసి భాస్కర్నగర్లో ఉంటున్నాడు. పుట్టినరోజు కావడంతో బిర్యానీ కొంటుండగా.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న మణికంఠ వేటకత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. దారుణానికి పాల్పడిన మణికంఠ నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు