ఉద్యోగంలో చేరిన తొలిరోజే శవమై.. నర్సుపై సామూహిక అత్యాచారం, హత్య?
కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఓ నర్సు (18)కు నూరేళ్లు నిండాయి. ఆస్పత్రి ఆవరణలోనే ఆమె శవమై వేలాడింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి, హత్య
కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఓ నర్సు (18)కు నూరేళ్లు నిండాయి. ఆస్పత్రి ఆవరణలోనే ఆమె శవమై వేలాడింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి, హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం శవపరీక్ష నివేదిక ప్రకారం.. అత్యాచారం జరగలేదని చెబుతున్నారు. బాంగర్మవూ ప్రాంతంలోని న్యూ జీవన్ ఆస్పత్రిలో శుక్రవారమే ఆమె నర్సుగా చేరింది. తొలిరోజు నైట్డ్యూటీ చేయాల్సి వచ్చింది. శనివారం ఉదయానికల్లా ఆస్పత్రి ఆవరణలో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రి వర్గాలు.. పోలీసులకు, మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాయి. ఈ దారుణం వెనుక ఆసుపత్రి మేనేజర్ల హస్తం ఉందన్న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ