Andhra News: అన్నం పెట్టిస్తామని తీసుకెళ్లి అత్యాచారం

రాత్రి వేళ రైల్వేస్టేషన్‌లో తలదాచుకున్న మహిళకు అన్నం పెట్టిస్తామని తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు

Published : 03 May 2022 08:19 IST

గత నెల 16న గురజాల రైల్వేస్టేషన్‌ సమీపంలో ఘటన
ప్రధాన నిందితుడి అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రాత్రి వేళ రైల్వేస్టేషన్‌లో తలదాచుకున్న మహిళకు అన్నం పెట్టిస్తామని తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం గుంటూరు జీఆర్పీ ఏఎస్పీ అజయ్‌ ప్రసాద్‌ తన కార్యాలయంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. గత నెల 16న ఒడిశాకు చెందిన మహిళ (25) పల్నాడు జిల్లా గురజాల రైల్వేస్టేషన్‌ బుకింగ్‌ కేంద్రం వద్ద రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ప్రయాణికుల సాయంతో బాధితురాలిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు అన్నం పెట్టిస్తామని నమ్మించి ఆమెను స్టేషన్‌ బయటకు తీసుకెళ్లి శివారు ప్రాంతంలో అత్యాచారం చేసినట్లు గుర్తించారు. ఇద్దరిలో రెండో నిందితుడు గురజాలకు చెందిన మాదిరాజు ప్రసాద్‌ను ఏప్రిల్‌ 21న అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కాండ్రకొండ సుబ్బారావును సోమవారం గుంటూరు రైల్వేస్టేషన్‌లో తూర్పు ప్రధాన ద్వారం వద్ద అరెస్టు చేశామని జీఆర్పీ ఏఎస్పీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని