కొకైన్.. పరేషాన్!
ఆఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్కు పెద్దఎత్తున కొకైన్ దిగుమతి అవుతుండటం పట్ల అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ ముఠాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తతంగానికి రాష్ట్ర రాజధాని వేదిక
హైదరాబాద్కు ఇబ్బడిముబ్బడిగా రాక
లోతైన దర్యాప్తుతోనే అడ్డుకట్ట
ఈనాడు, హైదరాబాద్: ఆఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్కు పెద్దఎత్తున కొకైన్ దిగుమతి అవుతుండటం పట్ల అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ ముఠాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తతంగానికి రాష్ట్ర రాజధాని వేదిక కావడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాల ముప్పు పొంచి ఉందంటున్నారు. పది నెలల వ్యవధిలోనే దాదాపు రూ.220 కోట్ల కొకైన్ పట్టుబడటం, ఇదంతా ఆఫ్రికా దేశాల నుంచే రావడం గమనార్హం. అన్నింటికీ మించి ఇంత ఖరీదైన మత్తు మందులను న్యాయవిచారణ పూర్తయ్యే వరకూ జాగ్రత్త చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారుతోంది.
గతంలోనూ కొకైన్ పట్టుబడ్డా అది గ్రాముల్లోనే ఉండేది. కానీ, ఇప్పుడు ఏకంగా కిలోల కొద్దీ దిగుమతి అవుతోంది. ఇంత పెద్దమొత్తంలో వినియోగం హైదరాబాద్లో లేదు. ఇక్కడికి దిగుమతి అయిన దాంట్లో చాలావరకూ మళ్లీ ఎగుమతి అవుతోందని, స్వల్ప మొత్తంలో మాత్రమే స్థానిక మార్కెట్కు తరలుతోందని భావిస్తున్నారు. గత పది నెలల్లో కొకైన్ సరఫరాకు సంబంధించి డీఆర్ఐ అధికారులు 8 కేసులు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి దాదాపు రూ.220 కోట్ల సరకును స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికా కేంద్రంగా పనిచేస్తున్న మత్తుమందుల ముఠాల కన్ను హైదరాబాద్పై పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నేరాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దిగుమతి అవుతున్న మత్తుమందులను పట్టుకోవడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారం కాదని.. ఎందుకు ఇలా పదేపదే హైదరాబాద్కే పంపుతున్నారు? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేసి పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది.
దాచేదెలా..
రూ.కోట్ల విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ వాటిని భద్రపరచడం అధికారులకు సవాల్గా మారింది. కేసు నమోదైనప్పటి నుంచి విచారణ పూర్తయ్యే వరకూ వాటిని ‘సాక్ష్యం’ కింద సురక్షితంగా ఉంచాల్సిందే. న్యాయస్థానం ఆదేశించిన తర్వాత మాత్రమే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. మౌలిక వసతులు తక్కువగా ఉన్న డీఆర్ఐ లాంటి వ్యవస్థలకు మత్తుమందులు దాచిపెట్టడం సవాల్తో కూడుకున్న వ్యవహారంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్