Telangana News: కోర్టు ఆవరణ నుంచి.. కారులో జీవిత ఖైదీ పరార్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ న్యాయస్థానం ఆవరణ.. చర్లపల్లి జైలు నుంచి ఒక జీవితఖైదీని.. వేరొక కేసులో విచారణ కోసం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. జైలులో పరిచయమైన మరో ఖైదీ బంధువులను ముందే అక్కడికి రప్పించిన ముద్దాయి వారి కారు తీసుకుని హఠాత్తుగా ఉడాయించాడు. ఆంధ్రప్రదేశ్ దిశగా పారిపోయిన అతడిని పోలీసులు ఫాస్టాగ్ ఆధారంగా గుర్తించారు. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటాక ఏపీలోని ప్రకాశం జిల్లాలో పట్టుకోగలిగారు. మిర్యాలగూడ ఒకటో పట్టణ సీఐ మండవ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఫాస్టాగ్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు
అర్ధరాత్రి వేళ ఆంధ్రాలో పట్టివేత
మిర్యాలగూడ, టంగుటూరు, న్యూస్టుడే: నల్గొండ జిల్లా మిర్యాలగూడ న్యాయస్థానం ఆవరణ.. చర్లపల్లి జైలు నుంచి ఒక జీవితఖైదీని.. వేరొక కేసులో విచారణ కోసం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. జైలులో పరిచయమైన మరో ఖైదీ బంధువులను ముందే అక్కడికి రప్పించిన ముద్దాయి వారి కారు తీసుకుని హఠాత్తుగా ఉడాయించాడు. ఆంధ్రప్రదేశ్ దిశగా పారిపోయిన అతడిని పోలీసులు ఫాస్టాగ్ ఆధారంగా గుర్తించారు. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటాక ఏపీలోని ప్రకాశం జిల్లాలో పట్టుకోగలిగారు. మిర్యాలగూడ ఒకటో పట్టణ సీఐ మండవ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశంకర్ (46)పై తెలుగు రాష్ట్రాల్లో 40కు పైగా కేసులున్నాయి. హైదరాబాద్లోని హయత్నగర్లో 2019లో జరిగిన కిడ్నాప్, అత్యాచారం కేసులో రవిశంకర్ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరో ఖైదీ శ్రీధర్తో ములాఖత్కు వచ్చిన అతడి బంధువులను రవిశంకర్ పరిచయం చేసుకున్నాడు. తాను మే నెల 5న మిర్యాలగూడ కోర్టుకు వస్తానని, ఆ రోజు అక్కడికి రావాలని వారిని కోరాడు. గురువారం ఉదయం రవిశంకర్ను అంబర్పేట హెడ్క్వార్టర్కు చెందిన రిజర్వు పోలీసులు మిర్యాలగూడ తీసుకువచ్చారు. కోర్టులో ప్రక్రియ ముగిసేసరికి సాయంత్రమైంది. అక్కడికి వచ్చిన తన మిత్రులతో మాట్లాడతానని రవిశంకర్ పోలీసులను కోరాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న శ్రీధర్ బంధువులతో మాట్లాడసాగాడు. పక్కనే వారి కారు (టీఎస్ 08 జీఎల్ 8818) ఉండగా, రవిశంకర్ తన పథకం అమలుకు సిద్ధమయ్యాడు. కారు తాళాలు ఇగ్నిషన్కు వదిలేసి ఉండడంతో అతడి పని సులువైంది. ఒక్క ఉదుటున కారెక్కి వేగంగా ఉరికించాడు. అద్దంకి రహదారి దిశగా దూసుకుపోయాడు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన రిజర్వు పోలీసులు స్థానిక పోలీసులకు తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. కారులో ఉన్న డ్రైవర్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఖైదీ గురజాల వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. కాసేపటికి ఆ ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఫాస్టాగ్ ఆధారంగా ప్రయత్నించారు. అందులో డబ్బులు నిల్వ లేకపోవడంతో అప్పటికప్పుడు రీఛార్జి చేయించి.. కారు వెళ్లే మార్గాన్ని అనుసరించారు. నల్గొండ జిల్లా పోలీసు కంట్రోల్ రూం నుంచి ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఒంగోలు-చెన్నై జాతీయ రహదారిపై గస్తీ నిర్వహించారు. తెల్లవారుజాము మూడు గంటల సమయంలో వల్లూరు ప్రాంతం వద్ద కారులో వస్తున్న రవిశంకర్ను గుర్తించారు. దాదాపు ఏడు కిలోమీటర్లు వెంబడించి టంగుటూరు టోల్గేట్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు అతడిని శుక్రవారం ఉదయం మిర్యాలగూడకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు