Crime News: రూ.1146 కోట్ల నిధుల మళ్లింపు.. నిందితుడి అరెస్టు
తప్పుడు పత్రాలతో రూ.1146 కోట్లను విదేశాలకు మళ్లించిన కేసులో దీపక్ నయ్యర్ అనే నిందితుణ్ని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ నెల 5న అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తులో భాగంగా నిందితుణ్ని విచారించేందుకు
ఈనాడు, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో రూ.1146 కోట్లను విదేశాలకు మళ్లించిన కేసులో దీపక్ నయ్యర్ అనే నిందితుణ్ని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ నెల 5న అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తులో భాగంగా నిందితుణ్ని విచారించేందుకు ఈ నెల 6 నుంచి 20 వరకూ తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఈడీ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దిల్లీలోని సీబే ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామి అయిన దీపక్ నయ్యర్ దేశంలోని ప్రముఖ కంపెనీలకు అవసరమైన క్లౌడ్ సీసీటీవీ ఫుటేజ్ నిల్వలను విదేశీ సంస్థల నుంచి అద్దెకు తీసుకున్నట్లు తప్పుడు బిల్లులు సృష్టించాడు. ఈ చెల్లింపుల పేరుతో ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ తదితర బ్యాంకుల నుంచి రూ.1146 కోట్లను హాంకాంగ్కు మళ్లించాడు. చైనా రుణయాప్లపై దర్యాప్తులో సీబే ఇంటర్నేషనల్ సంస్థ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు పసిగట్టి ఈడీకి సమాచారం అందించారు. దీని ఆధారంగా సీబే సంస్థ చైనా రుణయాప్లు ఆర్జించిన లాభాలను విదేశాలకు ఎలా దారి మళ్లించిందో ఈడీ గుర్తించింది. చైనా రుణయాప్ల సొమ్ముతోపాటు ఇంకొన్ని సంస్థల డబ్బు కూడా తప్పుడు ఇన్వాయిస్ల ద్వారా విదేశాలకు చేరినట్లు ఈడీ పసిగట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి హెచ్.ఎ.ఆర్. అసోసియేట్స్ సంస్థకు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్ను 2021 డిసెంబరు 27న ఈడీ అరెస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్