
గిరిజన మహిళపై హత్యాచారం.. అపస్మారక స్థితిలో ఉన్నా వదలని దుర్మార్గుడు
చౌటుప్పల్ గ్రామీణం, న్యూస్టుడే: రెక్కాడితే గానీ డొక్కాడని పేద గిరిజన కుటుంబం. పగటివేళ భర్త పనికి వెళ్లగా చూసిన ఓ దుండగుడు అతడి భార్యపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. మొదటిసారి లైంగికదాడి తర్వాత.. ఆమె అపస్మారకస్థితిలో అచేతనంగా పడి ఉంటే.. మరోసారీ అఘాయిత్యం చేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయాక కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకుని పారిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలో సోమవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటన రాత్రి సమయానికి పోలీసుల దృష్టికి వచ్చింది. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 24 గంటల్లోపే నిందితుడిని వెతికి పట్టుకున్నారు. అతడి నుంచి వివరాలు రాబడుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. విషయం బయటకు చెబుతుందనే భయంతో నిందితుడు ఆమెను చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పొట్టకూటి కోసం వలస వస్తే..
హత్యాచారానికి గురైన గిరిజన మహిళది నాగర్ కర్నూల్ జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండా. మార్చి 13న ఆమె భర్తతో పాటు తూప్రాన్పేటకు వలస వచ్చారు. వారిద్దరూ హైదరాబాద్-విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాము వద్ద కాపలాదారులుగా ఉంటూ.. అక్కడే నివసిస్తున్నారు. భర్త పగటివేళ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా.. సమీపంలోని గడ్డివాము దగ్గర రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఆయన వెంటనే బావమరిదికి, అత్తమామలకు, పోలీసులకు సమాచారం అందించారు. రాత్రికి రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు.
ఒంటరిగా ఉంటుందని గమనించి..
మహిళపై అత్యాచారం చేసింది సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు (24) అని పోలీసులు గుర్తించారు. అతడు తూప్రాన్పేటలోని సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పగటివేళ ఆ మహిళ ఒంటరిగా ఉంటోందని గమనించి.. అత్యాచారానికి తెగించాడు. చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పక్కా ఆధారాలతో నిందితుడిని 24 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్పై విరుచుకుపడిన రష్యా!
-
General News
Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
-
India News
Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి: ఈసీ
-
Politics News
KTR: యశ్వంత్ సిన్హా నామినేషన్కు మంత్రి కేటీఆర్.. దిల్లీకి పయనం
-
Sports News
Novak Djokovic: యూఎస్ ఓపెన్కు అనుమతించకపోయినా వ్యాక్సిన్ వేసుకోను: జకోవిచ్
-
Movies News
Social Look: సెకనులో రకుల్ ఫొటో.. తాప్సి ‘లండన్ పింక్’.. సోనాక్షి ‘సెల్ఫీ’!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్లో ఆప్కు భంగపాటు
- E Passport: ఈ పాస్పోర్ట్లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు