Death Certificate: బతికుండగానే మరణించినట్లు నమోదు.. మరణ ధ్రువీకరణ పత్రం జారీ
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో బతికున్న వ్యక్తిని మరణించినట్లు నమోదు చేయడంతోపాటు...
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, చక్రాయపేట: వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో బతికున్న వ్యక్తిని మరణించినట్లు నమోదు చేయడంతోపాటు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. తన భార్య గ్రామ సచివాలయ వాలంటీర్గా పని చేస్తున్నందున వీఆర్వోతో కలిసి మరణ ధ్రువీకరణ పత్రం పొంది వితంతు పింఛనుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు బళ్లారి సుభాహాన్ బాషా ఆరోపిస్తున్నారు. తాను బతికే ఉన్నానని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. బాధితుడు తెలిపిన ప్రకారం... రాయచోటిలో ఓ మహిళను వివాహం చేసుకున్న బాధితుడికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. మనస్పర్థలతో భార్యాభర్తలు గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం పొందడానికి చక్రాయపేటలోని గ్రామ సచివాలయం సిబ్బందిని కలిశారు. రేషన్ కార్డులో పేరు తొలగించిన కారణంగా పథకం వర్తించే అవకాశం లేదని సిబ్బంది సమాధానమిచ్చారు. కార్డులో పేరు తొలగింపు విషయం పరిశీలించగా మరణించినట్లు నమోదైందని తెలుసుకుని కార్డు పొందిన రాయచోటికి వెళ్లి తహసీల్దార్ను కలిశారు. కొత్తపల్లి-3 గ్రామ సచివాలయానికి చెందిన వీఆర్వో యోగాంజనేయరెడ్డి లాగిన్ ద్వారా ఆన్లైన్లో మరణించినట్లు నమోదైనట్లు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య కలెక్టరును కోరినట్లు బాధితుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి