
Hyderabad News: తల్లి మృతదేహంతో మూడు రోజులు ఇంట్లోనే!
మానసిక స్థితి కోల్పోయిన తనయుడు
మల్కాజిగిరిలో హృదయ విదారక ఘటన
ఈనాడు, హైదరాబాద్-మల్కాజిగిరి, న్యూస్టుడే: కళ్లెదుట కన్నతల్లి అచేతనంగా పడి ఉంది.. మానసిక పరిస్థితి బాగాలేని ఆ 25 ఏళ్ల కొడుకు ఇదేం పట్టకుండా పక్క గదిలో తనలో తానే మాట్లాడుకుంటూ మూడు రోజులు గడిపాడు. ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మల్కాజిగిరిలో ఈ హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. కాలనీవాసులు, మల్కాజిగిరి ఎస్సై యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన విప్పల రామ్మోహన్, విజయరాణి(50) భార్యాభర్తలు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసే రామ్మోహన్ 2015లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి చెందాక బెంగళూరు నుంచి వచ్చిన విజయరాణి తన కొడుకుతో కలిసి మల్కాజిగిరి పట్టణం విమలాదేవినగర్లోని మైత్రినివాస్ అపార్ట్మెంట్ సొంత ఫ్లాట్లో ఉంటోంది. ఇదిలా ఉండగా.. బీటెక్ పూర్తి చేసిన వెంకటసాయి తండ్రి మరణించడంతో మానసికంగా కుంగిపోయాడు. స్నేహితులు, బంధువులకు దూరమై ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు. తల్లితో తరచూ గొడవకు దిగుతూ పెద్దగా అరిచేవాడు. అతని అరుపులతో ఇబ్బంది పడుతున్నామంటూ స్థానికులు కొన్ని నెలల క్రితం కాలనీ సంఘానికి ఫిర్యాదు చేశారు. కుమారుడిపై ఫిర్యాదు చేశారనే ఉద్దేశంతో తల్లి సైతం ఇరుగుపొరుగు వారితో మాట్లాడటం లేదు. ఈ క్రమంలో వారి ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో పక్క ఫ్లాట్ యజమాని తలుపులు కొట్టి పిలిచినా తల్లీకొడుకులు పలకలేదు. దీంతో శుక్రవారం రాత్రి మల్కాజిగిరి పోలీసులకు సమాచారమివ్వగా.. వారు బలవంతంగా తలుపులు తెరిచి ఫ్లాట్లోపలికి ప్రవేశించారు. అందులోని ఓ గదిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విజయరాణి మృతదేహాన్ని గుర్తించారు. మరో గదిలో వెంకటసాయి తనలో తాను మాట్లాడుకుంటూ, బిత్తరచూపులు చూస్తున్నాడు. పోలీసులు విజయరాణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి వెంకటసాయిని అదుపులోకి తీసుకున్నారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. విజయరాణి మూడ్రోజుల క్రితమే మరణించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె తలకు గాయమైనట్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణం తెలుస్తుందని ఎస్సై తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
-
Sports News
IND vs ENG: భారత్ ఇంగ్లాండ్ ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే
-
India News
Bullet Train: భారత్లో బుల్లెట్ రైలు ఎప్పుడొస్తుంది..? మరింత ఆలస్యమేనా..?
-
General News
CM KCR: తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!