తెదేపా కార్యాలయంలో బీభత్సం
అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలోని తెదేపా కార్యాలయంలో సోమవారం రాత్రి వైకాపా కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. సర్పంచి పెదిరెడ్ల మాణిక్యం
మద్యం సీసాలు పగులగొట్టిన వైకాపా కార్యకర్తలు
బుచ్చెయ్యపేట, న్యూస్టుడే: అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలోని తెదేపా కార్యాలయంలో సోమవారం రాత్రి వైకాపా కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. సర్పంచి పెదిరెడ్ల మాణిక్యం కుమారులు పవన్ కుమార్, చంద్రశేఖర్, కలిమి అనిల్ తదితరులు తాగిన మైకంలో తెదేపా కార్యాలయంలోకి వచ్చి ఖాళీ మద్యం సీసాలను పగులకొట్టి పారిపోయారని మాజీ ఎంపీటీసీ సభ్యుడు గొన్నాబత్తుల శ్రీనివాసరావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చోడవరం సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్ దిబ్బిడి వచ్చి ఈ కార్యాలయాన్ని పరిశీలించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి బత్తుల తాతయ్య బాబు తదితరులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం స్టేషన్కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు