Crime News: కత్తితో బెదిరించి రూ.3 కోట్ల దోపిడీ.. బాధితుల పొంతనలేని సమాధానాలు

దుండగులు కారును అటకాయించి రూ.3 కోట్లు దోచుకెళ్లారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడవల్లి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌కు

Updated : 18 May 2022 06:44 IST

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: దుండగులు కారును అటకాయించి రూ.3 కోట్లు దోచుకెళ్లారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడవల్లి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన కాలురామ్‌, అరవింద్‌ కారులో కోల్‌కతా నుంచి కర్ణాటకలోని హోసపేటెకు వెళ్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో దోర్నాల మండలం యడవల్లి అటవీ ప్రాంత సమీపానికి రాగానే వెనుకగా మరో కారులో వచ్చిన దుండగులు కత్తితో బెదిరించి వీరి వాహనాన్ని ఆపారు. పక్కనే ఉన్న బలిజేపల్లి రహదారిలోకి కారు మళ్లించి, కొంతదూరం వెళ్లాక బెదిరించి అందులోని రూ.3 కోట్లు తీసుకున్నారు. వెళ్లేటప్పుడు ఆ కారు తాళం చెవిని చెట్ల మధ్యలో విసిరేశారు. బాధితులు కారును అక్కడే వదిలేసి కాలినడకన కర్నూలు - గుంటూరు రహదారి వైపు బయలుదేరారు. అటుగా వచ్చిన అటవీశాఖ గస్తీ సిబ్బంది కారును చూసి బాధితులను ఆరా తీయగా విషయం చెప్పారు. మంగళవారం ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే.. బాధితులు విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని