రూ.22.70 లక్షల విలువైన విత్తనాల సీజ్
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని విత్తన దుకాణాల్లో మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్
గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని విత్తన దుకాణాల్లో మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్.వి.మాధవరెడ్డి పర్యవేక్షణలో శ్రీవెంకటసాయి, మహాలక్ష్మి విత్తనాల దుకాణాల్లో అమ్మకం, నిల్వ దస్త్రాలు, విత్తనాల సంచులు పరిశీలించారు. అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రూ.22.70 లక్షల విలువైన 667 కిలోల పత్తి, 13 కిలోల మిర్చి, 56 కిలోల నూగు విత్తనాలు సీజ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వాటిని విక్రయించవద్దని యజమానులకు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203