బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 70 ఏళ్ల వ్ధృద్ధుడు బుధవారం అత్యాచారం చేశాడు. ఎస్సై ప్రసాద్‌ కథనం మేరకు.. ఉమాపతి (70).. తమ గ్రామానికే చెందిన బాలిక ఆడుకుంటుండగా నిర్మాణంలో

Published : 19 May 2022 05:27 IST

తవణంపల్లె, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 70 ఏళ్ల వ్ధృద్ధుడు బుధవారం అత్యాచారం చేశాడు. ఎస్సై ప్రసాద్‌ కథనం మేరకు.. ఉమాపతి (70).. తమ గ్రామానికే చెందిన బాలిక ఆడుకుంటుండగా నిర్మాణంలో ఉన్న సచివాలయంలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

నాయుడుపేటలో ఆరేళ్ల బాలికపై..

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం ముగ్గురు చిన్నారులు లేఅవుట్‌ పరిధిలో ఆడుకుంటుండగా అక్కడ కాపలా ఉంటున్న వ్యక్తి (56) ఓ బాలికను గది లోపలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని