
Andhra News: వైకాపా నేత స్థలం లాక్కున్నారని.. వేదనతో వృద్ధురాలి మృతి
యాదమరి, న్యూస్టుడే: తన ఇంటి స్థలాన్ని గ్రామానికి చెందిన, స్థానిక ప్రజాప్రతినిధి అయిన ఓ వైకాపా నాయకుడు లాక్కున్నారనే మనోవేదనతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని జంగాలపల్లికి చెందిన సుందరమ్మ (75) బుధవారం మరణించారు. ఆమె కుమారుడు వేణు కథనం మేరకు.. గత కొద్దికాలంగా సుందరమ్మకు చెందిన ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ఆమె భర్త కన్నయ్య విశ్రాంత విద్యుత్శాఖ ఉద్యోగి. ఆయన కొద్దికాలం క్రితం మరణించారు. 2006లో ఆయన జంగాలపల్లిలో స్థలం కొని ఇల్లు కట్టించారు. అధికార పార్టీ నాయకుడొకరు ఆ స్థలం తనదంటూ గత నెల 29న బలవంతగా ఇల్లు ఖాళీ చేయించి ఇంట్లోని వస్తువులను వేరే వాహనంలో తరలించి బండివాళ్ల ఊరు వద్ద పడవేశారు. దీనిపై బాధితులు యాదమరి పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం జరగలేదన్న వేదనతో సుందరమ్మ సరిగా ఆహారం తీసుకునేవారు కారు. ఇంటి స్థలం పోయిందన్న బాధతోనే మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆసుపత్రికి తరలించగా ఆక్కడ మరణించారని కుమారుడు వేణు తెలిపారు. ఈ విషయమై ఎస్సై ప్రతాప్రెడ్డిని వివరణ కోరగా, స్థల వివాదం, గొడవలపై ఇదివరకే కేసు నమోదైందని, అయితే సుందరమ్మది సహజ మరణమేనని చెప్పారు. ప్రస్తుతం ఆమె మరణంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
-
Business News
బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Mahesh babu: బిల్ గేట్స్తో మహేశ్బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం