పరీక్ష రాస్తూనే కుప్పకూలి విద్యార్థి మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం ఓ విద్యార్థి పరీక్ష రాస్తుండగానే కుప్పకూలి మృతి చెందాడు. సారవకోట మండలం దాసుపురం గ్రామానికి చెందిన బూరాడ కార్తీక్‌ (16) పాతపట్నం మహేంద్ర

Published : 19 May 2022 05:27 IST

పాతపట్నం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం ఓ విద్యార్థి పరీక్ష రాస్తుండగానే కుప్పకూలి మృతి చెందాడు. సారవకోట మండలం దాసుపురం గ్రామానికి చెందిన బూరాడ కార్తీక్‌ (16) పాతపట్నం మహేంద్ర జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతున్నాడు. బుధవారం ఉదయం తలనొప్పిగా ఉందని, వాంతులు చేసుకోవడంతో వసతిగృహ సంరక్షకుడు వైకుంఠరావు ఆసుపత్రిలో చూపించారు. కొద్దిసేపటికి తేరుకున్నాక ఉదయం 8.45 గంటలకు పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అక్కడ పరీక్ష రాస్తుండగానే 9.20 గంటలకు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నరాలు, మెదడుకు సంబంధించిన సమస్య వల్ల మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని