పిడుగు శబ్దాలకు ముగ్గురి మృతి

కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో రెండు చోట్ల బుధవారం రాత్రి పిడుగు శబ్దాలకు తండ్రీకుమారుడితోపాటు మరో యువకుడు మరణించారు.

Published : 20 May 2022 05:57 IST

హొళగుంద, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో రెండు చోట్ల బుధవారం రాత్రి పిడుగు శబ్దాలకు తండ్రీకుమారుడితోపాటు మరో యువకుడు మరణించారు. హొళగుంద బీసీ కాలనీలోని ఓ రేకులకొట్టంలో నివసిస్తున్న సిద్దిక్‌ సాబ్‌ (71), కుమారుడు హుస్సేన్‌ సాబ్‌ (43) పిడుగు శబ్దానికి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇదే మండలంలోని చిన్నహ్యేట గ్రామంలో వడ్డెరాజు (36) పిడుగు శబ్దానికి మరణించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడిన సమయంలో పిడుగు శబ్దాలు వినిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు