అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన రైతు హుసేన్‌బాషా (40) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హుసేన్‌ బాషా

Published : 21 May 2022 05:23 IST

చాగలమర్రి, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన రైతు హుసేన్‌బాషా (40) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హుసేన్‌ బాషా తన సొంత పొలం 4 ఎకరాలతో పాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశారు. గత మూడేళ్లుగా సాగు చేస్తున్న మినుము, వరి, మొక్కజొన్న తదితర పంటల్లో తీవ్రంగా నష్టపోయారు. దాదాపు రూ.20 లక్షల మేర అప్పులు చేశారు. వాటిని తీర్చలేక దిక్కుతోచని స్థితిలో గురువారం రాత్రి పొలానికి వెళ్లారు. అక్కడే పొలం పక్కనే ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం పొలం వద్దకు కుటుంబసభ్యులు వెళ్లి చూడగా హుసేన్‌ బాషా శవమై కనిపించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని