Lovers Suicide: కారుకు నిప్పంటించుకుని ప్రేమజంట ఆత్మహత్య

తమ ప్రేమను ఇరు కుటుంబాలూ వ్యతిరేకించడంతో తాము ప్రయాణించిన కారుపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో

Updated : 23 May 2022 10:57 IST

ఉడుపి, న్యూస్‌టుడే: తమ ప్రేమను ఇరు కుటుంబాలూ వ్యతిరేకించడంతో తాము ప్రయాణించిన కారుపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఉడుపి జిల్లా బ్రహ్వార తాలూకా హెగ్గుంజె గ్రామ సమీపంలో కారు దహనమవుతుండటాన్ని చూసిన స్థానికులు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు.  అప్పటికే యువతీయువకుడు అగ్నికి ఆహుతయ్యారు. బెంగళూరుకు చెందిన యశ్వంత్‌- జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జ్యోతి, యశ్వంత్‌ శనివారం రాత్రి మంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ కారును అద్దెకు తీసుకుని ఉడుపి వైపునకు పయనమయ్యారు. అంతకు కొద్ది సేపు ముందే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబ పెద్దలకు తెలిపినట్లు సమాచారం. వారు అప్రమత్తమయ్యేలోపే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కారుపై పెట్రోలు పోసుకుని లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. బ్రహ్మావర పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని