అనిశాకు చిక్కిన తహసీల్దార్, గిర్దావర్
భూమి హద్దుల గుర్తింపునకు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్, గిర్దావర్(రెవెన్యూ ఇన్స్పెక్టర్) అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి కలెక్టరేట్లో తహసీల్దార్ పెరుమాళ్ల సంపత్,...
అంతర్గాం, న్యూస్టుడే: భూమి హద్దుల గుర్తింపునకు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్, గిర్దావర్(రెవెన్యూ ఇన్స్పెక్టర్) అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి కలెక్టరేట్లో తహసీల్దార్ పెరుమాళ్ల సంపత్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ఇంటి వద్ద గిర్దావర్-2 ఎండీ అజీమొద్దీన్లను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు మెరుగు శంకర్గౌడ్, అనిశా కరీంనగర్ ఇన్ఛార్జి డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పెద్దంపేటకు చెందిన శంకర్గౌడ్ ఆకెనపల్లిలోని సర్వే నంబరు 105లోఉన్న తన 12.07 ఎకరాల వ్యవసాయ భూమిని సర్వేచేసి హద్దులు గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం తహసీల్దార్, గిర్దావర్లు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.లక్ష ఇస్తాననడంతో కార్యాలయంలోని ప్రైవేటు సహాయకుడు కడల లింగస్వామికి అప్పగించాలని వారు చెప్పారు. అప్పటికే శంకర్ అనిశా అధికారులను ఆశ్రయించండంతో.. కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా లింగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం తహసీల్దార్, గిర్దావర్, లింగస్వామిలను అరెస్టు చేసి అనిశా కోర్టులో హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్