కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలో ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల 9వ ప్యాకేజీ సొరంగంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
మట్టిపెళ్లలు పడి ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
కోనరావుపేట, న్యూస్టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల 9వ ప్యాకేజీ సొరంగంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కపేట మూడు టీఎంసీల రిజర్వాయర్కు నీటిని తరలించడానికి మధ్యమానేరు వరకు 12.03 కిలోమీటర్ల పొడవైన సొరంగానికి లైనింగ్ పనులు చేపడుతున్నారు. మర్తన్పేట శివారులోని అడిట్-2 సొరంగంలో మిగిలిన కిలోమీటరు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది కురిసిన భారీవర్షాలకు సొరంగం పైకప్పు వదులుగా మారడంతో మట్టిపెళ్లలు పడి లోపల లైనింగ్ పనులు చేస్తున్న ఝార్ఖండ్కు చెందిన యేగేందర్ మోహతా(24) అక్కడికక్కడే మృతి చెందాడు. కార్మికులు ఉమేశ్కుమార్, అవెల్ తోప్రా తీవ్రంగా గాయపడగా కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యేగేందర్ మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీరాం ప్రేమ్దీప్ పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్