చిక్కుడు తోటకు వైకాపా నేత నిప్పు
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో ఓ రైతు చిక్కుడు తోటకు వైకాపా నేత నిప్పంటించడంతో కాలిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. తుంగపాడుకు చెందిన ఈదర సీతారామయ్య ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు తోట
రొంపిచర్ల, న్యూస్టుడే: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో ఓ రైతు చిక్కుడు తోటకు వైకాపా నేత నిప్పంటించడంతో కాలిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. తుంగపాడుకు చెందిన ఈదర సీతారామయ్య ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు తోట సాగు చేశారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నేత ఏనుగంటి వెంకటరావు మంగళవారం దానికి నిప్పుపెట్టడంతో తోటతో పాటు బిందు సేద్యం పరికరాలు, పందిర్ల కోసం అమర్చిన గుంజలు దహనమయ్యాయి. దీంతో బాధిత రైతు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై హజరత్తయ్య తెలిపారు. ఘటనలో రూ.3.5 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు. అధికార పార్టీ అండతోనే వెంకటరావు.. నిప్పు అంటించాడని రైతు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా