
చిక్కుడు తోటకు వైకాపా నేత నిప్పు
రొంపిచర్ల, న్యూస్టుడే: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో ఓ రైతు చిక్కుడు తోటకు వైకాపా నేత నిప్పంటించడంతో కాలిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. తుంగపాడుకు చెందిన ఈదర సీతారామయ్య ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు తోట సాగు చేశారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నేత ఏనుగంటి వెంకటరావు మంగళవారం దానికి నిప్పుపెట్టడంతో తోటతో పాటు బిందు సేద్యం పరికరాలు, పందిర్ల కోసం అమర్చిన గుంజలు దహనమయ్యాయి. దీంతో బాధిత రైతు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై హజరత్తయ్య తెలిపారు. ఘటనలో రూ.3.5 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు. అధికార పార్టీ అండతోనే వెంకటరావు.. నిప్పు అంటించాడని రైతు ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే
-
Movies News
Sai Pallavi: ‘వెన్నెల’ పాత్ర చేయడం నా అదృష్టం: సాయిపల్లవి
-
India News
Sharad Pawar: ప్రభుత్వం మారగానే.. శరద్ పవార్కు ఐటీ నోటీసులు..!
-
Movies News
Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
-
Sports News
Jasprit Bumrah: ధోనీనే స్ఫూర్తి.. బుమ్రా కూడా అతడి లాగే..!
-
India News
India Corona: అవే హెచ్చుతగ్గులు.. కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- IND vs ENG: ఆఖరి సవాల్.. భారత్కు బుమ్రా సారథ్యం