
పావులుగా మగువలు!
మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో సమిధలవుతున్న అతివలు
ఈనాడు, హైదరాబాద్: కార్లలో, ద్విచక్రవాహనాలపై పయనించే మహిళలు నిబంధనలు పాటించకున్నా పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తారు. వారిపట్ల ఉన్న సానుభూతిని నేరస్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో తరచూ పట్టుబడుతున్న నిందితుల్లో ఎలాంటి నేరచరిత్ర లేని మహిళల భాగస్వామ్యం ఉండటం వెనుక లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇదంతా నేరస్థుల ఎత్తుగడగా గుర్తించారు. కుటుంబ బాధ్యతలు.. పిల్లల చదువులు.. కూలి చేసుకుంటూ ఇంటిని పోషించే మహిళల పేదరికాన్ని నేరస్థులు అవకాశంగా మలచుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన స్మగ్లర్లు గంజాయి తరలింపులో మహిళలు, యువతులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. 15-20 రోజులు పనిచేస్తే చేతికందే సొమ్మును 2-3 రోజులు సహకరిస్తే ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. ఒక్కో గ్రూపులో 2-4 వరకూ మహిళలు, యువతులు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రైవేటు వాహనాల్లో వీరిని అరకు, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాలకు చేర్చుతారు. అక్కడి ఏజెంట్లకు వీరి ఫోన్నంబర్లు అందజేస్తారు. మహిళలు ఆయా ప్రాంతాలకు చేరాక గంజాయి పొట్లాలను చేతిసంచుల్లోకి సర్దుతారు. తనిఖీలో పట్టుబడకుండా నిత్యావసర వస్తువులు, చీరలు, చిన్నపిల్లల దుస్తులను ఉంచుతారు. ఆర్టీసీ బస్సులు, రైలు మార్గాల్లో సికింద్రాబాద్ చేరతారు. ప్రయాణమధ్యలో పోలీసులు తనిఖీలు ఉన్నట్లు గుర్తిస్తే ఆ సంచులకు దూరంగా వెళ్లిపోతారు. సరకు సికింద్రాబాద్ చేరకముందే మౌలాలి వద్ద ఏజెంట్లు స్వాధీనం చేసుకుంటారు. సురక్షితంగా చేర్చిన ఒక్కో మహిళకు రోజుకు రూ.4,000-5,000 వరకూ ఇస్తారు. ఖరీదైన కార్లలో మాదకద్రవ్యాలు తరలించేందుకు 20-22 ఏళ్ల యువతులను నియమించుకుంటున్నారు. ఇటీవల నాలుగు ముఠాలు ఇదే తరహాలో సుమారు 1000 కిలోల సరకును జహీరాబాద్ చేరవేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతర్రాష్ట్ర ముఠాల వాహనాల్లో ఏపీ, ఏవోబీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకూ ఎస్కార్టుగా ఉన్న ఒక్కో యువతికి రూ.20,000-25,000 వరకూ ఇస్తున్నారని ఓ పోలీసు అధికారి వివరించారు. ఇటీవల పోలీసులకు పట్టుబడిన మేడ్చల్కు చెందిన ఓ మహిళ.. ముగ్గురు పిల్లలను పోషించేందుకు కూలి డబ్బులు చాలక గంజాయి పొట్లాలు చేరవేసేందుకు ఒప్పుకున్నానని కన్నీరు పెట్టుకుందంటూ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒకరు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్స్టోక్స్ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- Virat Kohli: బెయిర్స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- బిగించారు..ముగిస్తారా..?
- అర్ధంతరంగా వెనుదిరిగిన రఘురామకృష్ణరాజు
- Narendra Modi: డబుల్ ఇంజిన్ వస్తోంది
- Viral tweet: ‘క్యాబ్లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్