Hyderabad News: మహిళా ఉద్యోగి నగ్న చిత్రాలు తీసిన ఆఫీస్ బాయ్
తాను పనిచేసే ప్రాంతంలోని వాష్రూంలో కెమెరా పెట్టాడో ఉద్యోగి. మహిళా ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత పని మానేసిన ఆ ఉద్యోగి.. ఓ మహిళా ఉద్యోగి సెల్ఫోన్కు ఆమె నగ్న చిత్రాలను పంపాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..
బొటిక్ వాష్రూంలో కెమెరాలు
పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: తాను పనిచేసే ప్రాంతంలోని వాష్రూంలో కెమెరా పెట్టాడో ఉద్యోగి. మహిళా ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత పని మానేసిన ఆ ఉద్యోగి.. ఓ మహిళా ఉద్యోగి సెల్ఫోన్కు ఆమె నగ్న చిత్రాలను పంపాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ఓ బొటిక్లో ఓ మహిళ(32) గతంలో ఉద్యోగిగా పనిచేసి 2021లో మానేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమె సెల్ఫోన్కు ఒక సంక్షిప్త సందేశం వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన ఆ సందేశంలో ఆమె శరీర భాగాలపై అసభ్యంగా వివరణ ఉంది. ఈ నెల 20న అదే సెల్ఫోన్ నంబర్ నుంచి ఆమె నగ్న చిత్రాలు వచ్చాయి. అవి గతంలో తాను పనిచేసిన బొటిక్లో వాష్రూంకు వెళ్లిన సమయంలో తీసినవిగా ఆమె గుర్తించారు. ఆ బొటిక్లో గతంలో ఆఫీస్ బాయ్గా పనిచేసిన పశ్చిమ బెంగాల్కు చెందిన మిథున్ దాస్పై బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై వారు ఐపీసీ సెక్షన్ 354తోపాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కోల్కతా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ