పిస్తోలుతో కాల్చుకుని జవాను ఆత్మహత్య

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన జవాను కన్నెబోయిన రాములు(32) శుక్రవారం ఉదయం పంజాబ్‌లో పిస్తోలుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నెబోయిన రాజయ్య,

Published : 28 May 2022 05:47 IST

దుగ్గొండి, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన జవాను కన్నెబోయిన రాములు(32) శుక్రవారం ఉదయం పంజాబ్‌లో పిస్తోలుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నెబోయిన రాజయ్య, కొమురమ్మ దంపతుల కుమారుడైన రాములు పదేళ్ల క్రితం సరిహద్దు భద్రతాదళం(బీఎస్‌ఎఫ్‌)లో చేరారు. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ ప్రాంతాల్లో పనిచేశారు. రెండు నెలల క్రితం ఆయన సొంతూరుకు వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను పంజాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ రాములు ఆత్మహత్యకు పాల్పడినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహం శనివారం బేగంపేట విమానాశ్రయానికి రానున్నట్లు సమాచారం. రాములు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని