సిలిండర్‌ పేలి నలుగురి మృతి

సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై పేలుడు సంభవించడంతో నలుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామానికి చెందిన దాదు (35), ఆయన సోదరుడు రజాక్‌ పక్కపక్కనే నివాసముంటున్నారు.

Published : 29 May 2022 05:16 IST

శెట్టూరు, న్యూస్‌టుడే: సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై పేలుడు సంభవించడంతో నలుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామానికి చెందిన దాదు (35), ఆయన సోదరుడు రజాక్‌ పక్కపక్కనే నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి రజాక్‌ ఇంట్లో గ్యాస్‌ లీకై ఇల్లంతా ఆవరించింది. ఇది గమనించని రజాక్‌ శనివారం ఉదయం లేచి లైటు వేయగానే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఇంటిపైన పెట్టిన రాళ్లు మీద పడటంతో దాదు, అతని భార్య షర్ఫూన (30), కుమార్తె ఫిరదోస్‌ (6), తల్లి జైనూభి (60) ప్రాణాలు కోల్పోయారు. రజాక్‌, ఆయన కుమారుడు అబ్దుల్‌ రషీద్‌ తీవ్రంగా గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని