Andhra News: పెళ్లయిన మూడు రోజులకే... ప్రేమికుడితో వెళ్లిపోయిన వివాహిత!

పెళ్లయిన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో వివాహిత వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. ఆగ్రహించిన కుటుంబీకులు యువతి ప్రేమికుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో

Updated : 13 Jun 2022 17:39 IST

మంత్రాలయం, న్యూస్‌టుడే: పెళ్లయిన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో వివాహిత వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. ఆగ్రహించిన కుటుంబీకులు యువతి ప్రేమికుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

మాధవరం గ్రామానికి యువతితో ఈ నెల 9న సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అంతకుముందే ఆమె మాధవరానికి చెందిన శివాజీని ప్రేమించింది. పెళ్లయిన మూడో రోజున శివాజీ... ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. ఇది తెలుసుకున్న వధూవరుల బంధువులు ఆదివారం రాత్రి శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. అందులో దుస్తులు, బియ్యం కాలిపోయాయి. ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప సిబ్బందితో వెళ్లి చుట్టుపక్కల వారితో కలిపి మంటలు ఆర్పేశారు. ఆ సమయానికి శివాజీ కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని