పిడుగుపాటుకు రైతు మృతి

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన పాలె బ్రహ్మయ్య(46) అనే రైతు పిడుగు పడి మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల

Published : 24 Jun 2022 04:24 IST

పెంచికల్‌పేట్, న్యూస్‌టుడే: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన పాలె బ్రహ్మయ్య(46) అనే రైతు పిడుగు పడి మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మయ్య గురువారం ఉదయం వ్యవసాయ పనులకోసం తన చేనులోకి వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో సమీపంలోని చెట్టు కిందికి చేరారు. కొంతసేపటికి పిడుగుపడటంతో అక్కడికక్కడే మరణించారు. బ్రహ్మయ్యకు భార్య మమత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే పెద్ద కుమార్తె వివాహం చేశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామన్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని