మున్సిపల్ కమిషనర్పై వైకాపా నేతల దాడి
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పురపాలక సంఘం కమిషనర్ ఆర్.రాంబాబుపై వైకాపా కౌన్సిలర్, నాయకులు గురువారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులు
అనధికార లేఅవుట్లో నిర్మాణానికి అనుమతివ్వలేదని దారుణం
రాయచోటి, న్యూస్టుడే: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పురపాలక సంఘం కమిషనర్ ఆర్.రాంబాబుపై వైకాపా కౌన్సిలర్, నాయకులు గురువారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదన్న కారణంతో దాడి చేశారు. తొలుత 26వ వార్డు కౌన్సిలర్ కె.వెంకటనరసింహారెడ్డి, వైకాపా నాయకులు సహదేవరెడ్డి, రవీస్ కేఫ్ మహేశ్వర్రెడ్డి, గంగిరెడ్డి, డీలర్ నాగేంద్ర పురపాలక కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడి నుంచి పట్టణ ప్రణాళిక విభాగంలోకి వెళ్లి సదరు అధికారి గురించి ఆరా తీశారు. ఆయన విధుల్లో లేకపోవడంతో పక్కనే ఉన్న కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లారు. తాము పెట్టుకున్న దరఖాస్తును ఎందుకు తిరస్కరించారని కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. అనధికారిక లేఅవుట్లలో అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవని చెప్పడంతో అప్పటికే అక్కడున్న వైకాపా నాయకులు, కౌన్సిలర్, కొందరు యువకులతో కలిసి ఆయనపై దాడికి దిగారు. కమిషనర్ కేకలు వేయడంతో కార్యాలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే దాడికి పాల్పడిన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన విధులకు ఆటంకం కలిగిస్తూ దాడికి పాల్పడ్డారని కమిషనర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము పెట్టుకున్న దరఖాస్తును ఎలా వెనక్కి పంపుతారని కౌన్సిలర్ నరసింహారెడ్డి, ఆయన అనుచరులు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని కమిషనర్ వాపోయారు. ఎమ్మెల్యే చెప్పినా వినవా అంటూ చేయి చేసుకున్నారని తెలిపారు. దాడిలో తన చేతి భుజానికి మూగదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పురపాలక కార్యాలయ సిబ్బంది కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్