బైకుల చోరీలో సెంచరీ!
అతని కన్ను పడిదంటే ద్విచక్ర వాహనం మాయమవుతుంది. కొట్టేయడం... అమ్మేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు వాటి సంఖ్య 111కు చేరింది.
నిందితుడి నుంచి 111 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
జగ్గంపేట, న్యూస్టుడే: అతని కన్ను పడిదంటే ద్విచక్ర వాహనం మాయమవుతుంది. కొట్టేయడం... అమ్మేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు వాటి సంఖ్య 111కు చేరింది. తమకందిన సమాచారంతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాలలో సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్ఐ టి.రఘునాథరావులు విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏలేశ్వరానికి చెందిన నడిగట్ల కృష్ణ... జగ్గంపేటలో నివాసం ఉంటున్నాడు. ఆయన తణుకు, మండపేట, రాజమహేంద్రవరం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించి జగ్గంపేట మండలం గోవిందపురం, రాజపూడి, కృష్ణపురం, మన్యంవారిపాలెం, మల్లిశాల తదితర గ్రామాల్లో తక్కువ ధరకు విక్రయించేవాడు. గోవిందపురానికి చెందిన వ్యక్తి ఒకరు ఏకంగా 15 బైకులు కొని, సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. చోరీ వాహనాలను కొనుగోలు చేసిన వారికి పోలీసులు ఫోన్లు చేస్తుండటంతో ఒక్కొక్కరుగా వాటిని పోలీసుస్టేషన్కు తీసుకొస్తున్నారు. మరికొందరైతే బైకులను ఠాణా పరిసరాల్లో పెట్టేసి నెమ్మదిగా జారుకుంటున్నారు. వాహనాల చోరీ వ్యవహారంలో మరో నిందితుడు తెలంగాణలోని ఖమ్మం సబ్జైలులో వేరే నేరంలో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM