రైతును బలిగొన్న విద్యుత్తు తీగ

నారాయణపేట జిల్లాలో తెగిన విద్యుత్తు తీగ ఓ రైతును బలిగొంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 25 Jun 2022 05:19 IST

మాగనూరు, న్యూస్‌టుడే : నారాయణపేట జిల్లాలో తెగిన విద్యుత్తు తీగ ఓ రైతును బలిగొంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాగనూరు మండలం ఓబుళాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ఎలిమెని కిష్టప్ప (44) శుక్రవారం ఉదయం పొలానికి బయలుదేరారు. పొలం గట్టుపై నడుచుకుంటూ వెళుతుండగా.. పక్కనే ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు 11 కేవీ లైన్‌ను అనుసంధానం చేసే రాడ్‌ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. సమీప పొలాల రైతులు గుర్తించి వెంటనే మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కిష్టప్ప  మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని