షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సు దగ్ధం
జాతీయ రహదారి-44పై ఆదివారం అర్ధరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. 16 మంది ప్రయాణికులతో కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను
డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం
జడ్చర్ల గ్రామీణం, న్యూస్టుడే: జాతీయ రహదారి-44పై ఆదివారం అర్ధరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. 16 మంది ప్రయాణికులతో కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా దించేయడంతో ప్రాణనష్టం తప్పింది. హైదరాబాద్-1 డిపోబస్సు ఆదివారం రాత్రి 10 గంటలకు కర్నూలు బస్టాండ్ నుంచి బయలుదేరింది. అర్ధరాత్రి 1 గంటకు జడ్చర్ల సమీపంలోని దివిటిపల్లి వంతెన వద్దకు చేరేసరికి బస్సులో మంటలు వ్యాపించాయి. ప్రవేశ ద్వారం వద్ద సైతం మంటలు చెలరేగడంతో డ్రైవర్ తన పక్కన ఉండే తలుపు నుంచి ప్రయాణికులను కిందకు దింపారు. గతంలో ఇదే జాతీయరహదారిపై కొత్తకోట సమీపంలో ఓ బస్సు దగ్ధమై భారీఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ప్రయాణికులు, స్థానికులు ఆ ఘటనను తలచుకొని డ్రైవర్ అప్రమత్తంగా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించినట్లు గుర్తించామని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ శ్రీధర్, సీఐ రమేశ్బాబు తెలిపారు. పొగ వాసన రావడంతో బస్సును ఆపి పరిశీలించాక . ప్రయాణికులను దింపేశా అని డ్రైవర్ సురేష్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’