ఆయువు తీసిన సరదా ఆట
‘బయట ఎండ ఎక్కువగా ఉంది... ఎక్కడికీ వెళ్లొద్దు’ అని తల్లి చెప్పినా... ‘ఇప్పుడే వచ్చేస్తానమ్మా’ అంటూ ఆటకు వెళ్లిన బాలుడు అనూహ్యంగా దుర్మరణం పాలైన ఘటన మంగళవారం
ట్రాక్టర్, రోడ్డు రోలర్ల మధ్య నలిగి బాలుడి దుర్మరణం
గాజువాక, న్యూస్టుడే: ‘బయట ఎండ ఎక్కువగా ఉంది... ఎక్కడికీ వెళ్లొద్దు’ అని తల్లి చెప్పినా... ‘ఇప్పుడే వచ్చేస్తానమ్మా’ అంటూ ఆటకు వెళ్లిన బాలుడు అనూహ్యంగా దుర్మరణం పాలైన ఘటన మంగళవారం విశాఖపట్నం గాజువాకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... జీవీఎంసీ 71వ వార్డు సుందరయ్యకాలనీకి చెందిన పెయింటర్ బసవ ప్రకాశ్, కనకమహాలక్ష్మి దంపతులకు కుమారుడు శివకిరణ్(12), కుమార్తె ఉన్నారు. ఏడో తరగతి చదువుతున్న కిరణ్ మధ్యాహ్నం ఆడుకోవడానికి ఇద్దరు మిత్రులతో కలిసి సమీప దుర్గానగర్ గ్రీన్బెల్ట్ స్థలంలోకి వెళ్లాడు. అక్కడే నిలిపి ఉన్న ట్రాక్టర్ ఇంజిన్ పైకెక్కి స్టీరింగ్ వద్ద ఆడుకుంటూ... పొరపాటున క్లచ్ నొక్కాడు. వాహనం ముందుకు కదలడంతో భయాందోళనతో పక్కకు దూకేశాడు. ఊహించని విధంగా అక్కడే ఉన్న రోడ్డు రోలర్, ట్రాక్టర్ పెద్ద టైరు మధ్యలో ఇరుక్కుపోయాడు. స్నేహితుల కేకలు విని పరుగున వచ్చిన స్థానికులు... అతికష్టం మీద కిరణ్ను బయటకు తీశారు. బాలుడు అప్పటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాజువాక సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ