మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి అరెస్టు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పోలీసులకు లొంగియారు. పార్టీ కీలక సభ్యుడైన కోరుకొండ -పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శి (ఏసీఎస్) వంతాల
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితుడు
మరో 60 మంది సభ్యులూ లొంగుబాటు
పాడేరు, న్యూస్టుడే: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పోలీసులకు లొంగియారు. పార్టీ కీలక సభ్యుడైన కోరుకొండ -పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శి (ఏసీఎస్) వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్, అలియాస్ రాయుడును అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయనతో పని చేసిన పార్టీ సభ్యులు 33 మంది, మిలీషియా సభ్యులు 27మంది లొంగిపోయినట్లు విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ తెలిపారు. మంగళవారం పాడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్కుమార్తో కలిసి డీఐజీ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ కొండ్రుం గ్రామానికి చెందిన రామకృష్ణ మావోయిస్టు పార్టీ నాయకుడు భూపతి ప్రోద్బలంతో 2003లో మిలీషియా సభ్యుడిగా చేరి, అనతి కాలంలో ఏసీఎస్ స్థాయికి ఎదిగాడని డీఐజీ తెలిపారు. ఆయనపై ఒడిశా, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సుమారు 124 కేసులున్నాయని వెల్లడించారు. ఇందులో 14 హత్యలు, 13 ఎదురుకాల్పులు, మందుపాతరలు పేల్చడం, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం, కిడ్నాపులు, అభివృద్ధి పనులు అడ్డుకోవడం.. వంటి నేరాలున్నాయని పేర్కొన్నారు. 2018లో అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలతో ఆయనకు సంబంధముందని చెప్పారు. గతంలో ఇంజరి పంచాయతీ సమీపంలో అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు గిరిజనుల మృతికి కారణమయ్యాడన్నారు. ఆయనపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించిందని వివరించారు. రామకృష్ణను అరెస్టు చేసినప్పుడు ఆయన వద్ద ఉన్న రూ.39 లక్షల నగదుతో పాటు భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!