Crime News: భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపి.. ఆపై భర్త ఆత్మహత్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట మధ్య అనుమానం రాజుకుంది. అది పెనుభూతమై ఇద్దరి ప్రాణాలనూ బలిగొంది. భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపిన భర్త.. తానూ
పంజాగుట్ట, నాంపల్లి, న్యూస్టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట మధ్య అనుమానం రాజుకుంది. అది పెనుభూతమై ఇద్దరి ప్రాణాలనూ బలిగొంది. భార్యను నీళ్ల బకెట్లో ముంచి చంపిన భర్త.. తానూ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నర్సింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్(24), పంపా సర్కార్(22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. తొలుత ఆదిభట్లలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. తర్వాత పంజాగుట్ట సమీపంలోని ప్రేమ్నగర్లో అద్దె ఇంట్లో నివాసముంటూ.. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ మాల్లో కాపలాదారులుగా చేరారు. కొన్ని రోజులకే భార్య ప్రవర్తనపై మహానంద బిశ్వాస్ అనుమానం పెంచుకున్నాడు. ఈ అంశంపై ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. సోమవారం మధ్యాహ్నం భార్య పంపా సర్కార్తో గొడవపడిన బిశ్వాస్ నిండుగా నీరున్న బకెట్లో ఆమె తల ముంచి హతమార్చాడు. గదికి తాళం వేసి లక్డీకాపుల్ రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెన వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి వద్ద లభించిన పాకెట్ డైరీలో అస్సామీ భాషలో తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఇంటి చిరునామా సైతం ఉండటంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పంజాగుట్ట పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకొని తాళం పగులగొట్టి చూడగా.. పంపా సర్కార్ బకెట్లో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!