అర్ధరాత్రి వృద్ధ దంపతులపై దాడి
వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేసి బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన ఘటన బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అద్దంకి, న్యూస్టుడే: వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేసి బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన ఘటన బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కనే కొత్తమాసు హనుమంతరావు, విజయకుమారి దంపతులు కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఉద్యోగరీత్యా కుమారులు, వివాహమై కుమార్తె వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇంటి కింది భాగంలో దుకాణం ఉండగా, పై అంతస్తులో దంపతులు ఉంటున్నారు. మంగళవారం రాత్రి దంపతులిద్దరూ గదిలో నిద్రించారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఆగంతకుడు ఇద్దరిపై దాడి చేశాడు. వారు ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా దాడిచేసి, గాయపరిచాడు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఒంటిపై ఉన్న సుమారు 13 సవర్ల బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన దంపతులు ఉదయం ఏడు గంటలకు తేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హనుమంతరావును, అపస్మారక స్థితిలో ఉన్న విజయకుమారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత