వృద్ధ దంపతుల బలవన్మరణం
అప్పుల బాధ వృద్ధ దంపతుల ప్రాణాలను బలిగొంది. బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణపాలేనికి చెందిన బి.సుబ్బారావు (70), శేషమ్మ (50) బుధవారం ఉదయం ఇంట్లో
కారంచేడు, న్యూస్టుడే: అప్పుల బాధ వృద్ధ దంపతుల ప్రాణాలను బలిగొంది. బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణపాలేనికి చెందిన బి.సుబ్బారావు (70), శేషమ్మ (50) బుధవారం ఉదయం ఇంట్లో పురుగుమందు తాగారు. కుటుంబసభ్యులు గుర్తించేలోపు శేషమ్మ మరణించగా, సుబ్బారావు ఇంకొల్లు అసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలో చిన్న వ్యాపారం చేస్తున్నారు. చిన్నకుమారుడు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తుంటారు. తమకున్న రెండెకరాలతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు.మూడేళ్లుగా నష్టాలే వస్తున్నాయి. దీంతో తమకున్న రెండెకరాల భూమిని అమ్మి, కొంత అప్పులు తీర్చారు. 8 ఎకరాలు కౌలుకు తీసుకొని గత సంవత్సరం వేసిన మిర్చి పంట దెబ్బతిని అప్పు మరింత పెరిగింది. రూ.20 లక్షలకు పైగా అప్పు ఉండటంతో మనస్తాపానికి గురైన ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM