చెరువు నీటిలో భూమి మునుగుతోందని..
చెరువు పరిధిలో ఉన్న భూమి నీట మునుగుతోందన్న మనస్తాపంతో దివ్యాంగుడైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై
దివ్యాంగ రైతు ఆత్మహత్య
నాగర్కర్నూల్, న్యూస్టుడే: చెరువు పరిధిలో ఉన్న భూమి నీట మునుగుతోందన్న మనస్తాపంతో దివ్యాంగుడైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ పురపాలక సంఘం పరిధిలోని ఉయ్యాలవాడకు చెందిన ఆదిరాల కాశన్న(65)కు గ్రామ శివారులోని కేసరి సముద్రం చెరువు సమీపంలో రెండెకరాల భూమి ఉంది. ఆ భూమిలోనే పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు గత మూడేళ్లుగా కేఎల్ఐ ఎత్తిపోతల ద్వారా చెరువును నింపుతున్నారు. ఆ భూమి మొత్తం నీటిలో మునుగుతుండటంతో పంటలను సాగు చేయలేకపోతున్నారు. దివ్యాంగుడైన కారణంగా ఇతర పనులనూ చేసుకోలేకపోతున్నారు. నీటిలో మునుగుతున్న వ్యవసాయ భూమికి పరిహారం ఇప్పించాలని, లేనిపక్షంలో జీవనోపాధి కల్పించి న్యాయం చేయాలంటూ గత కొన్నాళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి చెరువు పక్కనే ఉన్న రేకుల గదిలో ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా