Andhra News: ఇంటికి మంటలంటుకుని.. తల్లి, కుమార్తె సజీవదహనం
ఇంటికి మంటలంటుకుని తల్లి, కుమార్తె సజీవ దహనమైన విషాద ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... అల్లవరం మండలం
ఎవరో నిప్పంటించారని బంధువుల ఆరోపణ
అల్లవరం, న్యూస్టుడే: ఇంటికి మంటలంటుకుని తల్లి, కుమార్తె సజీవ దహనమైన విషాద ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... అల్లవరం మండలం కొమరగిరిపట్నం పంచాయతీ పరిధిలోని ఆకులవారివీధిలో సాధనాల లింగన్న తన కుటుంబంతో కలిసి తాటాకు ఇంటిలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి లింగన్న ఓ గదిలో, ఆయన భార్య మంగాదేవి(40), చిన్న కుమార్తె జ్యోతి(21) మరో గదిలో నిద్రించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి నిప్పంటుకుంది. తల్లి,కుమార్తె మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. లింగన్న ప్రాణాలతో బయటపడ్డారు.
ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని ఎవరో కావాలనే ఇంటికి నిప్పు పెట్టారని బాధితుల బంధువులు ఆరోపించారు. 5 నెలల కిందట గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తిని జ్యోతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే సురేష్ మరో యువతిని ప్రేమించాడు. ఈ నేపథ్యంలో అతనే కుట్రపన్ని ఇంటికి నిప్పుపెట్టాడని బాధితుల బంధువులు ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మంత్రి పినిపే విశ్వరూప్ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా