కుకునూరుపల్లి గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చోరీ

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌(ఏపీజీవీ) బ్యాంకులో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. గ్యాస్‌ కట్టర్‌తో కిటికీ గ్రిల్‌ని తొలగించి

Published : 03 Jul 2022 05:39 IST

కొండపాక, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌(ఏపీజీవీ) బ్యాంకులో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. గ్యాస్‌ కట్టర్‌తో కిటికీ గ్రిల్‌ని తొలగించి లోపలికి చొరబడి రూ.85,017 చోరీ చేశారు. గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9.30 గంటలకు అకౌంటెంట్‌గా పనిచేసే పద్మలత బ్యాంకుకు చేరుకొని తాళాలు తీసి షెట్టర్లు తెరిచారు. లోపలి గ్లాస్‌ తలుపులను తెరిచేందుకు ప్రయత్నించగా.. తెరుచుకోలేదు. లోపల గడియపెట్టి ఉన్నట్టు అనుమానం రావడంతో బ్యాంకు పక్కన ఉన్న వీధి వైపు వెళ్లి చూడగా.. భవనం కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఉన్నాయి. వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి చోరీ జరిగినట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని