మనీలాండరింగ్కు సహకరించిన ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్కు చెందిన ఆర్ఈ కేబుల్స్ అండ్ కండక్టర్స్(ఆర్ఈసీసీ) సంస్థ ఎస్బీఐ వద్ద రుణం తీసుకుని మోసం చేసిన కేసులో ఇద్దరు ఎంట్రీ ఆపరేటర్లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ సంస్థ
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఆర్ఈ కేబుల్స్ అండ్ కండక్టర్స్(ఆర్ఈసీసీ) సంస్థ ఎస్బీఐ వద్ద రుణం తీసుకుని మోసం చేసిన కేసులో ఇద్దరు ఎంట్రీ ఆపరేటర్లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ సంస్థ వ్యాపార నిర్వహణ నిమిత్తం తీసుకున్న రుణాన్ని వ్యాపారానికి కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో బ్యాంకుకు రూ.74.83 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మోసంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆర్ఈసీసీ సంస్థ ఆ నిధులను మళ్లించేందుకు.. హైదరాబాద్లోని ప్రముఖ ఎంట్రీ ఆపరేటర్లు ఖగేష్ కచ్వాల్, వారణాసి దిలీప్ సహకరించినట్లు గుర్తించింది. ఆర్ఈసీసీకి సామగ్రిని సమకూర్చే నెపంతో వీరిద్దరూ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఆయా కంపెనీలకు చెల్లించినట్లు బోగస్ ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ పత్రాలు సృష్టించారు. అనంతరం ఆయా కంపెనీ ఖాతాల్లోకి బదిలీ అయిన సొమ్ము తిరిగి ఆర్ఈసీసీ నిర్వాహకుల చెంతకు చేరేందుకు సహకరించారు. ఇందుకోసం 0.25 శాతం కమీషన్ తీసుకున్నట్లు వీరిద్దరూ అంగీకరించారని ఈడీ వెల్లడించింది. ఇదే తరహాలో వీరిద్దరూ గోల్డెన్ జూబ్లీ హోటల్స్, వీఎన్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్.. తదితర సంస్థలకూ సహకరించినట్లు ఈడీ గుర్తించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ