బిడ్డలను నీటిలోకి తోసి.. తల్లి బలవన్మరణం
భర్త వేధింపులకు తాళలేక ఇద్దరు బిడ్డలు సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన వైయస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో చోటుచేసుకుంది. వీరపునాయునిపల్లి మండలంలోని సి.రాజుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(30)కి...
ఎర్రగుంట్ల, న్యూస్టుడే: భర్త వేధింపులకు తాళలేక ఇద్దరు బిడ్డలు సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన వైయస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో చోటుచేసుకుంది. వీరపునాయునిపల్లి మండలంలోని సి.రాజుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(30)కి... దువ్వూరు మండలం పుల్లారెడ్డినగర్కు చెందిన శ్రీనుతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరు ఐదేళ్ల నుంచి ఎర్రగుంట్లలోని మహేశ్వరనగర్లో కాపురం ఉంటున్నారు. చెడు వ్యసనాలకు లోనై, వేధింపులకు గురి చేస్తున్న భర్తలో మార్పు రాకపోవడంతో లక్ష్మీదేవికి జీవితంపై విరక్తి కలిగింది. కుమార్తె అక్షయ(9), కుమారుడు రేవంత్(7)లను సోమవారం ఉదయం నాపరాళ్ల గనుల్లోని నీటిలోకి తోసి తానూ దూకి లక్ష్మీదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు