Telangana News: హైదరాబాద్‌ ఘటన మరువక ముందే.. యువతికి ఎస్సై లైంగిక వేధింపులు!

హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సంఘటన మరవక ముందే కుమురం భీం జిల్లాలోనూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్సై) నుంచి ఓ యువతి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఘటన వెలుగుచూసింది.

Updated : 12 Jul 2022 08:18 IST

కుమురం భీం జిల్లాలో ఘటన

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సంఘటన మరవక ముందే కుమురం భీం జిల్లాలోనూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్సై) నుంచి ఓ యువతి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఘటన వెలుగుచూసింది. పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతికి సదరు ఎస్సై ఫోన్‌ చేసి ఠాణాకు పిలిచారు. పుస్తకాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆందోళన చెందిన యువతి సమీప బంధువుల దగ్గర ఈ విషయం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో వారంతా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు ఎస్సైపై కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా ప్రత్యేక విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని