Road accident: రోడ్డు ప్రమాదంలో ఆరుగురి దుర్మరణం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు దుర్మరణం చెందారు. రాయచూరు జిల్లా హట్టి గ్రామానికి చెందిన పలువురు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా
కర్ణాటకలో ఘటన
రాయచూరు, న్యూస్టుడే: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు దుర్మరణం చెందారు. రాయచూరు జిల్లా హట్టి గ్రామానికి చెందిన పలువురు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ చిత్లాపల్లిలోని దర్గాను గురువారం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో గురుమఠకల్కు 20 కిలోమీటర్ల దూరంలో వీరి కారును ఎదురుగా వచ్చిన గూడ్స్ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలిలోనే నలుగురు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఫాజిల్ అనే బాలికను కలబురగి ఆసుపత్రిలో చేర్పించారు. మృతులను.. హీనా (30), ఇమ్రాన్(22), మహ్మద్ మజర్ హుస్సేన్ (76), నూర్జహాన్ బేగం (70), వాజీద్ హుస్సేన్ (40), ఉమేజా (20)లుగా గుర్తించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.