అమలాపురం అల్లర్ల కేసులో పక్కా ఆధారాలతోనే అరెస్టులు
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనలో పక్కా ఆధారాలతోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి తెలిపారు.
కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి వెల్లడి
అమలాపురం పట్టణం, న్యూస్టుడే: కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనలో పక్కా ఆధారాలతోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అల్లర్ల ఘటనలో విధ్వంసానికి పాల్పడుతున్న వారి వీడియోలు చూపించారు. ప్రస్తుతం మరో నలుగురిని అరెస్టు చేశామని, వారిలో గున్నాబత్తుల అనిల్, వి.తూము శశికుమార్, కడలి ప్రసాద్, గుర్రాల సత్యసాయి ఉన్నారన్నారు. ఈ కేసులో మొత్తం 239 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తప్పుచేయని వారిని పరిశీలించి వెనక్కి పంపుతున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు పెడుతున్న వారిని గుర్తించామని, త్వరలో వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్