భార్య, పసికందును హతమార్చి.. భర్త ఆత్మహత్య!
కుటుంబ కలహాలతో భార్య, ఐదు నెలల పసికందును హతమార్చి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇస్కపల్లిపాలెంలో ఆదివారం జరిగింది.
అల్లూరు, న్యూస్టుడే: కుటుంబ కలహాలతో భార్య, ఐదు నెలల పసికందును హతమార్చి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇస్కపల్లిపాలెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఏడాదిన్నర క్రితం ఇస్కపల్లిపాలేనికి చెందిన ఆవుల మురళి(25), స్వాతి(20)లకు వివాహమైంది. వీరికి ఐదు నెలల క్రితం పాప జన్మించింది. వీరిమధ్య వివాదాలతో కొన్ని రోజులుగా స్వాతి పుట్టింటి వద్ద ఉంటోంది. ఇంటికి తీసుకొచ్చేందుకు భర్త పలుమార్లు ప్రయత్నించినా వీలుకాలేదు. 4వ తేదీన మురళి అక్క వెంకటరమణమ్మ.. స్వాతికి నచ్చజెప్పి, అత్తగారింటికి తీసుకొచ్చింది. శనివారం రాత్రి మురళి, స్వాతి, పాప ఇంట్లోనే ఉన్నారు. ఆదివారం ఉదయం చాలాసేపటి వరకు ఇంటి తలుపులు తీయలేదు. తలుపులు పగలగొట్టి చూడగా.. స్వాతి, పాప మృతిచెందగా మురళి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమార్తె స్వాతిని, మనవరాలిని స్వాతి మామ గోవిందు, అత్త బంగారమ్మ, ఆడబిడ్డ వెంకటరమణమ్మ కలిసి హత్య చేశారని ఆమె తండ్రి గోవిందు అల్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తెపై ఇష్టం లేకుంటే ఇంటికి పంపాల్సిందని, ఇలా హతమార్చడం దారుణమని తండ్రి భోరున విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు