Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
నంద్యాల జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ల బరితెగింపునకు పరాకాష్ఠ ఈ దారుణం. రాత్రివేళ ఒంటరిగా బైక్పై వెళ్తున్న ఓ కానిస్టేబుల్ను వెంటాడి వేటాడి హత్య చేయడం సంచలనం రేపింది. తప్పించుకునేందుకు పరుగులు
మద్యం మత్తులో రౌడీషీటర్ల దుశ్చర్య
వాహనదారులను బెదిరించి బైక్లపై పరారీ
సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు
నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే: నంద్యాల జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ల బరితెగింపునకు పరాకాష్ఠ ఈ దారుణం. రాత్రివేళ ఒంటరిగా బైక్పై వెళ్తున్న ఓ కానిస్టేబుల్ను వెంటాడి వేటాడి హత్య చేయడం సంచలనం రేపింది. తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న వ్యక్తిపై బీరు సీసాలతో దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డుకాగా, సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఫుటేజీలను పరిశీలిస్తే టెక్కెలోని టాటూ దుకాణం వద్ద ఆదివారం రాత్రి మద్యం తాగుతున్న రౌడీషీటర్లకు కానిస్టేబుల్ సురేంద్రకుమార్ (35) కనిపించారు. అతనితో వారు గొడవకు దిగారు. మాట్లాడుతుండగానే తమ వద్ద ఉన్న బీరు సీసాలతో సురేంద్ర తలపై దాడి చేశారు. నిందితులు ఆరుగురు ఉండటంతో వారినుంచి తప్పించుకునేందుకు సురేంద్ర పద్మావతి సర్కిల్ వైపు పరుగులు తీశారు. నిందితులు అతడిని వెంటపడి పట్టుకుని పక్కనే ఉన్న ఆటోలో ఎక్కించారు. ఆటోడ్రైవర్ను కొట్టి, అతని మెడపై కత్తి పెట్టి పట్టణ శివారులోని చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లారు. తలకు దెబ్బ తగలడంతో అప్పటికే స్పృహ కోల్పోయిన సురేంద్ర గుండెలో, వీపుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనాస్థలి నుంచే ముగ్గురు పరారుకాగా, మరో ఇద్దరు పట్టణంలోకి వచ్చి బుల్లెట్ వాహనాలపై వెళ్తున్న వారిని కొట్టి వారి వాహనాలు తీసుకొని పరారైనట్లు సమాచారం.
ముమ్మరంగా గాలింపు
నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేంద్రకుమార్ హత్యపై ఎస్పీ రఘువీర్రెడ్డి సంబంధిత పోలీస్స్టేషన్ సీఐ, ఎస్సై, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ ఘటనపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఎంవీ రమణ తెలిపారు. మరోపక్క, సురేంద్ర మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని డీఎస్పీ మహేశ్వర్రెడ్డితో కలిసి ఎస్పీ సందర్శించి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. సాయంత్రం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని