విద్యుత్తు తీగ తెగిపడి బాలుడి మృతి
విద్యుత్తు తీగ తెగి వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్(బి)లో మంగళవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ
కంగ్టి, న్యూస్టుడే: విద్యుత్తు తీగ తెగి వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్(బి)లో మంగళవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ ఈశ్వర్గౌడ్, సర్పంచి రాజ్కుమార్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం....నాగూర్(బి) గ్రామానికి చెందిన బాలప్ప- నిర్మల దంపతుల కుమారుడు శివరాం(9) వీధిలో ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో వీచిన గాలికి విద్యుత్తు తీగ తెగి బాలుడిపై పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్తు సరఫరా చేసే నియంత్రిక వద్ద కరెంటు సరఫరాను నిలిపివేశారు. అప్పటికే బాలుడికి విద్యుదాఘాతానికి గురవడంతో స్థానిక వైద్యుడికి చూపించగా...మృతిచెందినట్లు పేర్కొనడంతో కుటుంబీకులు బోరున విలపించారు. గ్రామంలో దశాబ్దాల కిందట అమర్చిన విద్యుత్తు స్తంభాలు, తీగలు శిథిలావస్థకు చేరాయని, వాటిని మార్చాలని గతంలో ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అభంశుభం తెలియని చిన్నారి ప్రాణం పోయిందని గ్రామస్థులు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం