ప్రేమికులనే ప్రచారంతో ఆత్మహత్యాయత్నం
అన్నాచెల్లెలుగా ఉంటున్న తమపై.. ప్రేమికులనే ముద్ర వేశారనే మనస్తాపంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్లో జరిగింది. మూడో ఠాణా
చికిత్స పొందుతూ యువకుడి మృతి
కోలుకుంటున్న బాలిక
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: అన్నాచెల్లెలుగా ఉంటున్న తమపై.. ప్రేమికులనే ముద్ర వేశారనే మనస్తాపంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్లో జరిగింది. మూడో ఠాణా ఎస్సై భాస్కరాచారి వివరాల ప్రకారం.. నందిపేట్కు చెందిన యువకుడు(22) నిజామాబాద్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) నిజామాబాద్లో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. తామిద్దరం అన్నాచెల్లెలుగా ఉంటుంటే అందరూ ప్రేమికులుగా ప్రచారం చేశారని లేఖ రాసి.. ఈనెల 8న రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల సమీపానికి చేరుకొన్నారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. మూడో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)