‘అగ్నిపథ్‌ కేసు’ భయం.. యువకుడి ఆత్మహత్య

అగ్నిపథ్‌కు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళన నిర్వహించిన అభ్యర్థుల వెంట ఉన్న తనపైనా కేసు నమోదవుతుందేమోననే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య

Updated : 12 Aug 2022 06:12 IST

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: అగ్నిపథ్‌కు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళన నిర్వహించిన అభ్యర్థుల వెంట ఉన్న తనపైనా కేసు నమోదవుతుందేమోననే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర ఎస్సై మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..

నిర్మల్‌ జిల్లా తానూరు మండలం బెల్‌తరోడకు చెందిన మహేష్‌(25) నిజామాబాద్‌లో ఉంటూ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రెండు రోజుల క్రితం చరవాణి ద్వారా బాసర గోదావరి నది దగ్గర ఉన్నానని చెప్పి కుటుంబ సభ్యులకు సందేశం పంపించాడు. దీంతో వారు  అక్కడకు వచ్చి వెతికినా ఆచూకీ దొరకలేదు. గురువారం మొదటి స్నాన ఘాట్‌ వద్ద అతడి శవాన్ని గుర్తించిన స్నేహితులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. కొన్ని రోజుల నుంచి అగ్నిపథ్‌ విషయమై తనపై కేసు నమోదవుతుందని ఆందోళన చెందుతున్నాడని, ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని