కోడలి తల నరికిన చిన్నత్త
కోడలిపై అనుమానం పెంచుకున్న చిన్నత్త ఆమె తలను నరికి, దాన్ని తీసుకొని నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా కేంద్రం
దాంతోనే నేరుగా పోలీసు స్టేషన్కు
రాయచోటి, న్యూస్టుడే: కోడలిపై అనుమానం పెంచుకున్న చిన్నత్త ఆమె తలను నరికి, దాన్ని తీసుకొని నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం చోటు చేసుకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని మంగళపల్లెకు చెందిన వసుంధర(35)కు దేవపట్లకు చెందిన రాజాతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరు పదేళ్ల కిందట రాయచోటిలోని కె.రామాపురానికి వచ్చి స్థిరపడ్డారు. రాజా ఏడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అప్పటి నుంచి వసుంధర తనకు చిన్నత్త అయిన సుబ్బమ్మ(రాజా చిన్నమ్మ)ను చేరదీసి తనతోపాటే ఉంచుకుంది. వసుంధర ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సుబ్బమ్మ అనుమానం పెంచుకుంది. పైగా సుబ్బమ్మ పేరుపై ఉన్న ఇంటిని రాసివ్వాలని వసుంధర పట్టుపడుతూ ఉండేది. ఈ క్రమంలో సుబ్బమ్మ తన అన్న కుమారుడు చంద్రబాబుతో కలిసి ఆమెను అంతమొందించేందుకు పథకం పన్నింది. గురువారం వసుంధరను భోజనానికి పిలిచి, రాగానే మరికొంత మందితో కలిసి దాడి చేసి ఆమె గొంతు కోశారు. ఆ తర్వాత తలతో పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లి హల్చల్ చేసి, మళ్లీ వెనక్కి వచ్చి మృతదేహం వద్దే తలను పెట్టినట్లు సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. నిందితురాలిని, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ